భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం
హనుమంతుడంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే
కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో,
అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్, చిత్త
సంస్కారం కూడా కనిపిస్తుంది. ఎంతటి అనుపమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో, అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా వ్యక్తమవుతుంది. ఎంతటి అపారమైన
శాస్త్రపాండిత్యం ప్రకటితమవుతుందో, అంతే తీక్షణమైన
బహ్మ్రచర్య తేజం భాసిస్తుంది. ఎంతటి ప్రతాపరౌద్రం కనిపిస్తుందో, అంతటి పరమశాంత చిత్తం కూడా దర్శనమిస్తుంది. వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి,
రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక శక్తుల మేలుకలయికగా హనుమ రామాయణంలో
అనేకచోట్ల దర్శనమిస్తాడు.
దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు
పరమశివుడే రామకార్యాన్ని సాధించాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడని పరాశర
సంహిత చెబుతోంది.
దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం
రక్షణాయ చ । రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీహనుమాన్ శివః ॥ - వైశాఖమాసం, కృష్ణ పక్ష దశమి, శనివారం,
పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి, మధ్యాహ్నవేళలో, కర్కాటకలగ్నంలో ఆంజనేయుడు
జన్మించినట్లు అందులో ఉంది. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం
ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించాడు.
ఓంకార హనుమ
హనుమాన్
అనే శబ్దానికి ‘జ్ఞానవాన్’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం ఉంది.
‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. శబ్దార్థపరంగా చూస్తే,
‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, ఉ, మ’ - ఈ మూడు కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు
ఓంకార స్వరూపుడనే విషయం అత్యంత స్పష్టంగా తెలుస్తుంది.
విద్యాహనుమ
హనుమంతుడు అనగానే అద్భుతమైన బలపరాక్రమాలు
గుర్తుకువస్తాయి. అపరిమితమైన భుజశక్తికి తోడు హనుమంతుడు గొప్ప విద్యావేత్త కూడా.
కర్మసాక్షి, ప్రత్యక్షదైవం
అయిన సూర్యభగవానుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఉపనయనం పూర్తయ్యాక ఓ రోజు
హనుమ సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని అభ్యర్థిస్తాడు. నేను
క్షణం కూడా స్థిరంగా ఉండననే విషయం లోకమంతా తెలిసిందే కదా. అలాంటి నేను నీకెలా
విద్య నేర్పించగలను. మరెవ్వరైనా గురువును చూసుకోమంటాడు సూర్యుడు. తన శరీరాన్ని
అమాంతంగా పెంచి, తూర్పు పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు
పెట్టాడు. సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడిని విద్య
నేర్పించమని ప్రార్థించాడు. తన శిష్యుడి శక్తి సామర్థ్యాలకు, బలపరాక్రమాలకు సూర్యుడు ముచ్చటపడి, హనుమను
శిష్యుడిగా స్వీకరించాడు. వేదాలు, వేదాంగాలు, వ్యాకరణంతో సహా అన్ని శాస్త్రాలు నేర్చుకుని గొప్ప పండితుడవుతాడు హనుమ.
అంతటి పండితుడు కాబట్టే హనుమ మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేదని ఏదీ
ఉండదంటాడు రాముడు. ఎవరో నిరాశ పరిచారనో, ఏవో అడ్డంకులు
వచ్చాయనో ఎంపిక చేసుకున్న విద్య నేర్చుకోవటాన్ని మానుకునే నేటితరం విద్యార్థులకు
హనుమ ఓ చక్కటి ఆదర్శంగా నిలుస్తాడు. విద్య నేర్పించాల్సిన గురువే వద్దని వారించినా
హనుమ నిరుత్సాహ పడలేదు. గురువును మెప్పించి విద్య నేర్చుకున్నాడు. నేటితరానికి
హనుమ ఓ పాఠం.
సుందర హనుమ
హనుమకు తల్లి అంజనాదేవి పెట్టిన పేరు
సుందరుడు. అద్భుతమైన సౌందర్యమూర్తి హనుమంతుడు. సూర్యుడిని మింగాలని ఆకాశానికి
ఎగిరిన బాలాంజనేయుడిని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది దవడల మీద
బలంగా తాకటంతో చెక్కుకున్నట్లు అవుతాయి. అలా చెక్కబడిన దవడలు కలిగిన వాడు కావటంతో
సుందరుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు. మరొక విశేషం ఏమిటంటే...రామాయణంలోని అన్ని సర్గలకు
అందులోని కథాంశాన్ని బట్టి పేరు పెట్టాడు వాల్మీకి. కానీ సీతాన్వేషణ జరిగిన సర్గకు
మాత్రం సుందరకాండ అని పేరు పెట్టాడు. నిజానికి హనుమత్కాండ అని పేరు పెట్టాలని
అందరూ అంటారు. కానీ హనుమ అసలు పేరు సుందరుడు కదా. అందుకని వాల్మీకి ఈ సర్గకు
సుందరకాండ అని పేరు పెట్టారని ప్రతీతి.
హనుమంతుడి మంత్రాల్లో ‘సుందర హనుమన్
మహామంత్రం’ ఒకటి. వాల్మీకి తన శ్లోకాల్లో అంతర్గతంగా ఈ సుందర మంత్రాన్ని
నిక్షిప్తం చేశాడు కాబట్టి సుందరకాండ అయిందని మరొక వివరణ. నిజానికి భౌతిక
సౌందర్యాన్ని మించినది హృదయ సౌందర్యం. మొత్తం రామాయణంలో ఎక్కడా తన గురించి
చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనత అంతా రాముడికే కట్టబెట్టాడు.
సీతమ్మను రామయ్య చెంత చేర్చటం తప్ప మరోధ్యాస లేదు హనుమకు. అందుకే ఆ హృదయాన్ని
మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టే ఈ కాండ సుందరకాండ అయింది.
రాజు పూజలందుకున్న బంటు
హనుమంతుడు రాముడు బంటు. అందరికీ తెలిసిన
విషయమే. కానీ రామయ్యే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది.
దీనిప్రకారం సూర్యుడిని మింగటానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడి మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు
ఇంద్రుడు. హనుమ ఓ పర్వతం మీద పడి, మూర్ఛపోతాడు. బిడ్డకు కలిగిన కష్టం చూసి వాయుదేవుడు కోపంతో
అన్నిలోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేస్తాడు. దీంతో లోకాలన్నీ అల్లకల్లోలం
అవుతాయి.
విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట
పెట్టుకుని హనుమంతుడున్న చోటుకి వస్తాడు. అతడిని పునర్జీవితుడిని చేసి అనేక
వరాలిస్తాడు. మిగిలిన దేవతలందరూ కూడా తమ శక్తిని హనుమంతుడికి ఇచ్చి, తమకు సంబంధించిన అస్త్ర,
శస్త్రాలేవీ అతడి మీద పనిచెయ్యవంటూ వరాలిస్తారు. హనుమంతుడి పేరుతో
హనుమద్ర్వతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి
పనులన్నీ హనుమ చేసిపెడతాడని బ్రహ్మదేవుడు ఈ సందర్భంలో చెబుతాడు. ఈ కథంతా రాముడికి
హనుమే స్వయంగా చెబుతాడు.
సీతాన్వేషణలో ఉన్న రాముడు పంపానదీ తీరంలో
హనుమంతుడు వేదిక మీద కూర్చోపెట్టి
లక్ష్మణుడితో సహా ఈ వ్రతం చేస్తాడు. వ్రతం
ఫలితంగా సీతాన్వేషణ మొదలు సీతారామ పట్టాభిషేకం
వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద
వేసుకుని నడిపిస్తాడు హనుమ. తన యజమాని చేత
పూజలందుకున్న ఏకైక బంటు హనుమ మాత్రమే.
వేద హనుమ
హనుమ అనే పదానికి ఉపనిషత్తులు చెబుతున్నఅర్థం
‘వేదం’. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారం. వేదాలు ఘోషిస్తున్నది విష్ణు
స్వరూపాన్నే. అటువంటి వేదస్వరూపుడైన విష్ణువు రామావతారంలో సీతను అన్వేషిస్తూ
కొండలు, కోనలు తిరుగుతాడు. అలాంటి
రాముడు ఓ సందర్భంలో హనుమంతుడి భుజాల్ని అధిరోహిస్తాడు. నిజానికి రాముడు నడవలేక
కాదు. వేదం మాత్రమే వేదస్వరూపుడిని భరించగలదు. ఇతరులకు అది సాధ్యం కాదు. భగవంతుడి
తత్త్వం మాత్రమే భగవంతుడిని ప్రకటించగలదు. భరించగలదు. కాబట్టి హనుమ రామయ్యను భుజాల
మీద కూర్చోపెట్టుకున్నాడంటే హనుమ వేదస్వరూపుడని చెప్పకనే చెప్పినట్లయింది.
శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో అందరికీ
కానుకలతో కృతజ్ఞతను తెలియజేస్తూ, హనుమను కూడా ఏంకావాలో కోరుకోమన్నాడు. అప్పుడు హనుమ ‘నాకు
నీయందు సదా పరమమైన ప్రేమను ప్రసాదించ’మన్నాడు. ఆ మాటకు రాముని హృదయం పరవశించి,
సింహాసనం నుంచి దిగి హనుమను బిగియారా కౌగలించుకుని ఆశీర్వదించాడు.
అంతేకాదు ‘నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నా ప్రాణాలు
ఇస్తాను. కాని ఉపకారాలు మిగిలిపోతాయి. ఆ విషయంగా నేను ఋణగ్రస్తుణ్ణి. నీ ఉపకారాలు
నా దేహంలో జీర్ణమై పోనీ. నీవల్ల నా కష్టాలు
తొలిగాయి. నీకు ఉపకారం చేయాలంటే నాకు వచ్చిన కష్టాలు నీకు రావాలి.
నీకు కష్టం కలిగిందన్న ఊహ వచ్చినా నా మనస్సు బాధపడుతుంది. అది చెడు భావన. అటువంటి
భావన రాకుండా నీ ఉపకారాలన్నీ నాలో జీర్ణమైపోవుగాక’ అని కోరుకుంటాను అంటాడు. ఇది
హనుమపై శ్రీరాముని భావన మాత్రమే కాదు. తరచి చూసేత ఆత్మ-పరమాత్మల కలయికకు ప్రతీక.
కర్తృత్వ, భోక్తృత్వ జ్ఞాతృత్వాల పట్ల అహంకార, మమకారాలు
లేని వాడు హనుమ. తాను భగవంతుని ప్రేరణతోనే బయలుదేరానని, రామబాణం
వలే (యథా రాఘవ నిర్ముక్త శ్శరస్వశన విక్రమః - వాల్మీకి
రామాయణం) లంకలో ప్రవేశించగలనని చెప్పాడే కాని తన శక్తి సామర్థ్యాలను ప్రకటించలేదు.
ఇది హనుమ స్వరూపాన్ని చక్కగా చిత్రించే సంఘటన. రామరావణ
యుద్ధంలో మూర్ఛితుడైన లక్ష్మణుని
పునరుజ్జీవింపజేయటానికి సంజీవని పర్వతాన్ని
తెచ్చినప్పుడు, నన్ను
నా వంశాన్ని నిలిపావంటూ హనుమను చిరంజీవిగా ఆశీర్వదించాడు రాముడు. హనుమంతుని
ప్రజ్ఞాపాటవాలను కిష్కింధాకాండ నుంచి చూసి ప్రశంసించకుండా ఉండలేం. మంత్రిగా,
సేనానాయకునిగా, సలహాదారునిగా విభీషణ శరణాగతి
సందర్భంలో దౌత్యవేత్తగా, కార్య కుశలుడుగా, సత్యశీలిగా, కర్తవ్యనిష్టునిగా, మహాబలవంతునిగా ఇలా ఎన్నో రూపాల్లో చూస్తాం. అందుకే హనుమ రామాయణం అనే మణిహారంలో
రత్నమై వెలిగొందాడు.
మనుస్మృతిలో చెప్పినట్లు ప్రభువు పట్ల
అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం దేశకాలతత్త్వం తెలిసి ఉండటం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం దూతకు ఉండాలి. ఈ లక్షణాన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే
శ్రీరాముని ప్రేమకు పాత్రుడయ్యాడు. అటువంటి హనుమను మనసారా స్మరిస్తే బుద్ధి,
కీర్తి, బలం, ధైర్యం,
నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండడం, వాక్పటుత్వం మొదలైన మంచి లక్షణాన్నీ ప్రాప్తిస్తాయి.
--------------------------------------
రచన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, లెక్చరర్, కె.బి.ఎన్.కాలేజీ, కొత్తపేట, విజయవాడ-1
సెల్: 9032044115
భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం
హనుమంతుడంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే
కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో,
అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్, చిత్త
సంస్కారం కూడా కనిపిస్తుంది. ఎంతటి అనుపమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో, అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా వ్యక్తమవుతుంది. ఎంతటి అపారమైన
శాస్త్రపాండిత్యం ప్రకటితమవుతుందో, అంతే తీక్షణమైన
బహ్మ్రచర్య తేజం భాసిస్తుంది. ఎంతటి ప్రతాపరౌద్రం కనిపిస్తుందో, అంతటి పరమశాంత చిత్తం కూడా దర్శనమిస్తుంది. వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి,
రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక శక్తుల మేలుకలయికగా హనుమ రామాయణంలో
అనేకచోట్ల దర్శనమిస్తాడు.
దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు
పరమశివుడే రామకార్యాన్ని సాధించాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడని పరాశర
సంహిత చెబుతోంది.
దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం
రక్షణాయ చ । రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీహనుమాన్ శివః ॥ - వైశాఖమాసం, కృష్ణ పక్ష దశమి, శనివారం,
పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి, మధ్యాహ్నవేళలో, కర్కాటకలగ్నంలో ఆంజనేయుడు
జన్మించినట్లు అందులో ఉంది. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం
ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించాడు.
ఓంకార హనుమ
హనుమాన్
అనే శబ్దానికి ‘జ్ఞానవాన్’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం ఉంది.
‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. శబ్దార్థపరంగా చూస్తే,
‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, ఉ, మ’ - ఈ మూడు కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు
ఓంకార స్వరూపుడనే విషయం అత్యంత స్పష్టంగా తెలుస్తుంది.
విద్యాహనుమ
సుందర హనుమ
హనుమకు తల్లి అంజనాదేవి పెట్టిన పేరు
సుందరుడు. అద్భుతమైన సౌందర్యమూర్తి హనుమంతుడు. సూర్యుడిని మింగాలని ఆకాశానికి
ఎగిరిన బాలాంజనేయుడిని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది దవడల మీద
బలంగా తాకటంతో చెక్కుకున్నట్లు అవుతాయి. అలా చెక్కబడిన దవడలు కలిగిన వాడు కావటంతో
సుందరుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు. మరొక విశేషం ఏమిటంటే...రామాయణంలోని అన్ని సర్గలకు
అందులోని కథాంశాన్ని బట్టి పేరు పెట్టాడు వాల్మీకి. కానీ సీతాన్వేషణ జరిగిన సర్గకు
మాత్రం సుందరకాండ అని పేరు పెట్టాడు. నిజానికి హనుమత్కాండ అని పేరు పెట్టాలని
అందరూ అంటారు. కానీ హనుమ అసలు పేరు సుందరుడు కదా. అందుకని వాల్మీకి ఈ సర్గకు
సుందరకాండ అని పేరు పెట్టారని ప్రతీతి.
హనుమంతుడి మంత్రాల్లో ‘సుందర హనుమన్
మహామంత్రం’ ఒకటి. వాల్మీకి తన శ్లోకాల్లో అంతర్గతంగా ఈ సుందర మంత్రాన్ని
నిక్షిప్తం చేశాడు కాబట్టి సుందరకాండ అయిందని మరొక వివరణ. నిజానికి భౌతిక
సౌందర్యాన్ని మించినది హృదయ సౌందర్యం. మొత్తం రామాయణంలో ఎక్కడా తన గురించి
చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనత అంతా రాముడికే కట్టబెట్టాడు.
సీతమ్మను రామయ్య చెంత చేర్చటం తప్ప మరోధ్యాస లేదు హనుమకు. అందుకే ఆ హృదయాన్ని
మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టే ఈ కాండ సుందరకాండ అయింది.
రాజు పూజలందుకున్న బంటు
హనుమంతుడు రాముడు బంటు. అందరికీ తెలిసిన
విషయమే. కానీ రామయ్యే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది.
దీనిప్రకారం సూర్యుడిని మింగటానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడి మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు
ఇంద్రుడు. హనుమ ఓ పర్వతం మీద పడి, మూర్ఛపోతాడు. బిడ్డకు కలిగిన కష్టం చూసి వాయుదేవుడు కోపంతో
అన్నిలోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేస్తాడు. దీంతో లోకాలన్నీ అల్లకల్లోలం
అవుతాయి.
విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట
పెట్టుకుని హనుమంతుడున్న చోటుకి వస్తాడు. అతడిని పునర్జీవితుడిని చేసి అనేక
వరాలిస్తాడు. మిగిలిన దేవతలందరూ కూడా తమ శక్తిని హనుమంతుడికి ఇచ్చి, తమకు సంబంధించిన అస్త్ర,
శస్త్రాలేవీ అతడి మీద పనిచెయ్యవంటూ వరాలిస్తారు. హనుమంతుడి పేరుతో
హనుమద్ర్వతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి
పనులన్నీ హనుమ చేసిపెడతాడని బ్రహ్మదేవుడు ఈ సందర్భంలో చెబుతాడు. ఈ కథంతా రాముడికి
హనుమే స్వయంగా చెబుతాడు.
సీతాన్వేషణలో ఉన్న రాముడు పంపానదీ తీరంలో
హనుమంతుడు వేదిక మీద కూర్చోపెట్టి
లక్ష్మణుడితో సహా ఈ వ్రతం చేస్తాడు. వ్రతం
ఫలితంగా సీతాన్వేషణ మొదలు సీతారామ పట్టాభిషేకం
వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద
వేసుకుని నడిపిస్తాడు హనుమ. తన యజమాని చేత
పూజలందుకున్న ఏకైక బంటు హనుమ మాత్రమే.
వేద హనుమ
హనుమ అనే పదానికి ఉపనిషత్తులు చెబుతున్నఅర్థం
‘వేదం’. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారం. వేదాలు ఘోషిస్తున్నది విష్ణు
స్వరూపాన్నే. అటువంటి వేదస్వరూపుడైన విష్ణువు రామావతారంలో సీతను అన్వేషిస్తూ
కొండలు, కోనలు తిరుగుతాడు. అలాంటి
రాముడు ఓ సందర్భంలో హనుమంతుడి భుజాల్ని అధిరోహిస్తాడు. నిజానికి రాముడు నడవలేక
కాదు. వేదం మాత్రమే వేదస్వరూపుడిని భరించగలదు. ఇతరులకు అది సాధ్యం కాదు. భగవంతుడి
తత్త్వం మాత్రమే భగవంతుడిని ప్రకటించగలదు. భరించగలదు. కాబట్టి హనుమ రామయ్యను భుజాల
మీద కూర్చోపెట్టుకున్నాడంటే హనుమ వేదస్వరూపుడని చెప్పకనే చెప్పినట్లయింది.
శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో అందరికీ
కానుకలతో కృతజ్ఞతను తెలియజేస్తూ, హనుమను కూడా ఏంకావాలో కోరుకోమన్నాడు. అప్పుడు హనుమ ‘నాకు
నీయందు సదా పరమమైన ప్రేమను ప్రసాదించ’మన్నాడు. ఆ మాటకు రాముని హృదయం పరవశించి,
సింహాసనం నుంచి దిగి హనుమను బిగియారా కౌగలించుకుని ఆశీర్వదించాడు.
అంతేకాదు ‘నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నా ప్రాణాలు
ఇస్తాను. కాని ఉపకారాలు మిగిలిపోతాయి. ఆ విషయంగా నేను ఋణగ్రస్తుణ్ణి. నీ ఉపకారాలు
నా దేహంలో జీర్ణమై పోనీ. నీవల్ల నా కష్టాలు
తొలిగాయి. నీకు ఉపకారం చేయాలంటే నాకు వచ్చిన కష్టాలు నీకు రావాలి.
నీకు కష్టం కలిగిందన్న ఊహ వచ్చినా నా మనస్సు బాధపడుతుంది. అది చెడు భావన. అటువంటి
భావన రాకుండా నీ ఉపకారాలన్నీ నాలో జీర్ణమైపోవుగాక’ అని కోరుకుంటాను అంటాడు. ఇది
హనుమపై శ్రీరాముని భావన మాత్రమే కాదు. తరచి చూసేత ఆత్మ-పరమాత్మల కలయికకు ప్రతీక.
కర్తృత్వ, భోక్తృత్వ జ్ఞాతృత్వాల పట్ల అహంకార, మమకారాలు
లేని వాడు హనుమ. తాను భగవంతుని ప్రేరణతోనే బయలుదేరానని, రామబాణం
వలే (యథా రాఘవ నిర్ముక్త శ్శరస్వశన విక్రమః - వాల్మీకి
రామాయణం) లంకలో ప్రవేశించగలనని చెప్పాడే కాని తన శక్తి సామర్థ్యాలను ప్రకటించలేదు.
ఇది హనుమ స్వరూపాన్ని చక్కగా చిత్రించే సంఘటన. రామరావణ
యుద్ధంలో మూర్ఛితుడైన లక్ష్మణుని
పునరుజ్జీవింపజేయటానికి సంజీవని పర్వతాన్ని
తెచ్చినప్పుడు, నన్ను
నా వంశాన్ని నిలిపావంటూ హనుమను చిరంజీవిగా ఆశీర్వదించాడు రాముడు. హనుమంతుని
ప్రజ్ఞాపాటవాలను కిష్కింధాకాండ నుంచి చూసి ప్రశంసించకుండా ఉండలేం. మంత్రిగా,
సేనానాయకునిగా, సలహాదారునిగా విభీషణ శరణాగతి
సందర్భంలో దౌత్యవేత్తగా, కార్య కుశలుడుగా, సత్యశీలిగా, కర్తవ్యనిష్టునిగా, మహాబలవంతునిగా ఇలా ఎన్నో రూపాల్లో చూస్తాం. అందుకే హనుమ రామాయణం అనే మణిహారంలో
రత్నమై వెలిగొందాడు.
మనుస్మృతిలో చెప్పినట్లు ప్రభువు పట్ల
అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం దేశకాలతత్త్వం తెలిసి ఉండటం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం దూతకు ఉండాలి. ఈ లక్షణాన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే
శ్రీరాముని ప్రేమకు పాత్రుడయ్యాడు. అటువంటి హనుమను మనసారా స్మరిస్తే బుద్ధి,
కీర్తి, బలం, ధైర్యం,
నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండడం, వాక్పటుత్వం మొదలైన మంచి లక్షణాన్నీ ప్రాప్తిస్తాయి.
--------------------------------------
రచన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, లెక్చరర్, కె.బి.ఎన్.కాలేజీ, కొత్తపేట, విజయవాడ-1
సెల్: 9032044115