మహా గణపతి ఆయన వదనం ఓంకారం...ఆయన మాట శ్రీకారం...ఆయన పూర్ణసృష్టికి సంకేతం. అతి గొప్ప ఆధ్యాత్మికతత్త్వం ఆయనదేనంటూ శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. యోగ గణపతిగా ఆయన ప్రాధాన్యాన్ని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.
‘త్వం మూలాధారే స్థితోస్మి నిత్యమ్...
త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్’.
త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్’.
మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే... యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారని గణపతి అధర్వశీర్షం చెబుతోంది. యోగశాస్త్రంలో వినాయకుడిని మూలాధారచక్రానికి అధిష్ఠాన దేవతగా భావిస్తారు. మూలాధారం వద్ద సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకుని, పైన పడగ కప్పుకొని ఉన్న పాములా ఉంటుందని పతంజలి వెల్లడించారు. యోగి తన సాధన ద్వారా సుషుమ్నను మేల్కొలుపుతాడు. దీంతో మిగిలిన అయిదు చక్రాలూ ఉత్తేజితం అవుతాయి. ఈ క్రియవల్ల హంసలా మనిషిలో సంచరించే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. అప్పుడు ఆత్మ పరమాత్మ ఏకమవుతాయి. ఈ యోగప్రక్రియ మొత్తానికి సూత్రం మూలాధారం. ఆ చక్రానికి అధిష్ఠానదేవత గణపతి.
గజవదనం ఓంకారాన్ని సూచిస్తుంది. ‘అ’కారం నుంచి ‘క్ష’కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణాల వరకు వివిధ అంగాలుగా భావించిన మన మహర్షులు ‘అక్షర గణపతి’ని ఆవిష్కరించారు. అక్షర స్వరూపమైన గణపతిని ఆరాధించడం అంటే అక్షరాల్ని ఉపాసించటమే అవుతుంది. అక్షరం అంటే నాశనం కానిది అని అర్థం. నాశనం లేనిది జ్ఞానం ఒక్కటే. గణపతి ఉపాసన అంటే జ్ఞానాన్ని ఉపాసించటమే అవుతుంది.
మన శరీరంలో సుషుమ్నతో పాటు ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో ‘ఇడ’ బుద్ధికి, ‘పింగళ’ సిద్ధికి సంకేతాలు. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార అధిపతి అయిన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడన్నమాట. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనడంలో అంతరార్థకూడా ఇదే. మనలో ఉన్న దురాలోచనలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు మనసు శాశ్వతమైన ముక్తిస్థానాన్ని కోరుకుంటుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి వస్తుంది. మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది. గణపతి ఉపాసనలోని అంతరార్థం, ఆయన తత్త్వం ఇదే. యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలోని మూలాధారంలో త్రికోణ యంత్రం ఉంటుంది. దానికి అధిపతి గణపతి కాబట్టి యంత్ర శాస్త్రంలోనూ ఆయనదే తొలిస్థానం
వ్యాసమహర్షి మహాభారతాన్ని రాసే నేర్పు గణపతికే ఉందని భావించాడు. గణపతి కూడా సరేనన్నాడు. అయితే, వ్యాసుడు ‘నేను చెప్పే ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే రాయా’లంటూ నియమం పెట్టాడు. వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు. గణపతి రాస్తూనే ఉన్నాడు.. ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకుంటూ. అలా పంచమ వేదమైన మహాభారతం ఆవిర్భవించింది. అద్భుతాలు జరగాలంటే ఏమరుపాటు పనికిరాదు. గొప్ప సన్నద్ధత, దృఢదీక్ష కావాలి. పనులు ప్రారంభించాక వచ్చే ఆటంకాలు చూసి బెదరిపోకూడదు. చివరదాకా పట్టుదలగా నిలవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన ఈ లక్షణాలన్నిటినీ గణపతి ఆచరణాత్మకంగా అందించాడు.
మన శరీరంలో సుషుమ్నతో పాటు ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో ‘ఇడ’ బుద్ధికి, ‘పింగళ’ సిద్ధికి సంకేతాలు. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార అధిపతి అయిన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడన్నమాట. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనడంలో అంతరార్థకూడా ఇదే. మనలో ఉన్న దురాలోచనలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు మనసు శాశ్వతమైన ముక్తిస్థానాన్ని కోరుకుంటుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి వస్తుంది. మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది. గణపతి ఉపాసనలోని అంతరార్థం, ఆయన తత్త్వం ఇదే. యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలోని మూలాధారంలో త్రికోణ యంత్రం ఉంటుంది. దానికి అధిపతి గణపతి కాబట్టి యంత్ర శాస్త్రంలోనూ ఆయనదే తొలిస్థానం
వ్యాసమహర్షి మహాభారతాన్ని రాసే నేర్పు గణపతికే ఉందని భావించాడు. గణపతి కూడా సరేనన్నాడు. అయితే, వ్యాసుడు ‘నేను చెప్పే ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే రాయా’లంటూ నియమం పెట్టాడు. వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు. గణపతి రాస్తూనే ఉన్నాడు.. ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకుంటూ. అలా పంచమ వేదమైన మహాభారతం ఆవిర్భవించింది. అద్భుతాలు జరగాలంటే ఏమరుపాటు పనికిరాదు. గొప్ప సన్నద్ధత, దృఢదీక్ష కావాలి. పనులు ప్రారంభించాక వచ్చే ఆటంకాలు చూసి బెదరిపోకూడదు. చివరదాకా పట్టుదలగా నిలవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన ఈ లక్షణాలన్నిటినీ గణపతి ఆచరణాత్మకంగా అందించాడు.
మట్టితో ప్రాణ ప్రతిష్ఠ
ఆకాశం నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని, దాని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఏర్పడ్డాయి. జడ పదార్థమైన భూమి, చైతన్యం కలిగిన నీటితో కలిసి ప్రాణశక్తిని పొందుతుంది. ఆహార పదార్థాలు, ఓషధులు అందిస్తుంది. ఇలా ప్రాణ, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తారు. మట్టి గణపతిని పూజించడం, ఆ తర్వాత నిమజ్జనం చేయడం ఉత్తమ ఆచారంగా చెబుతారు.
ఒక్కడే... ఒక్కడే...
గణపతిని త్రిగుణాలకు అతీతుడుగా, త్రికాలాలకు (భూత, భవిష్యత్, వర్తమాన) అందనివాడుగా పంచభూతాలకు ఆత్మగా, సకల దేవతాస్వరూపుడిగా అధర్వణ వేదంలోని గణపతి అధర్వశీర్షం ప్రకటిస్తుంది. త్రిమూర్తులతో సహా పంచభూతాలూ ఆయన స్వరూపమే అంటోందీ స్తోత్రం. ‘ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః’ ... గణపతి అధర్వ శీర్షంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రపాఠం ఇది. స్తోత్రరూపంగా సాగే ఈ అధర్వశీర్ష పారాయణ వేగంగా ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
గణపతిని త్రిగుణాలకు అతీతుడుగా, త్రికాలాలకు (భూత, భవిష్యత్, వర్తమాన) అందనివాడుగా పంచభూతాలకు ఆత్మగా, సకల దేవతాస్వరూపుడిగా అధర్వణ వేదంలోని గణపతి అధర్వశీర్షం ప్రకటిస్తుంది. త్రిమూర్తులతో సహా పంచభూతాలూ ఆయన స్వరూపమే అంటోందీ స్తోత్రం. ‘ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః’ ... గణపతి అధర్వ శీర్షంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రపాఠం ఇది. స్తోత్రరూపంగా సాగే ఈ అధర్వశీర్ష పారాయణ వేగంగా ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
ఆ గణపతి వేరయా...
‘ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం’ గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం ఇది. రుగ్వేదం రెండో మండలంలో ఇది ఉంది. గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతోందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు. మొత్తంగా గణపతి సర్వస్వతంత్ర, సర్వవ్యాపక, సర్వశక్తి సమన్వితుడైన దేవుడని సమస్త సాహిత్యం విస్పష్టంగా ప్రకటిస్తోంది. అశ్వమేధయాగంలో ఉపయోగించే ఒక మంత్రం ఉంది.
గణానాం త్వా గణపతిగ్ం హవామహే / ప్రియానాం త్వా ప్రియపతిగ్ం హవామహే / నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ / అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం..’ అంటూ సాగే ఈ మంత్రం హిరణ్యగర్భుడిగా ఉన్న ప్రజాపతిని ఉద్దేశించింది. ఇందులో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు. మైత్రాయణీ సంహితలో ‘తత్ కరటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్’ అనే మంత్రం ఉంది. ఈ ఒక్కచోటే గజముఖుడి గురించి వేదాల్లో కనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.
‘ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం’ గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం ఇది. రుగ్వేదం రెండో మండలంలో ఇది ఉంది. గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతోందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు. మొత్తంగా గణపతి సర్వస్వతంత్ర, సర్వవ్యాపక, సర్వశక్తి సమన్వితుడైన దేవుడని సమస్త సాహిత్యం విస్పష్టంగా ప్రకటిస్తోంది. అశ్వమేధయాగంలో ఉపయోగించే ఒక మంత్రం ఉంది.
గణానాం త్వా గణపతిగ్ం హవామహే / ప్రియానాం త్వా ప్రియపతిగ్ం హవామహే / నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ / అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం..’ అంటూ సాగే ఈ మంత్రం హిరణ్యగర్భుడిగా ఉన్న ప్రజాపతిని ఉద్దేశించింది. ఇందులో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు. మైత్రాయణీ సంహితలో ‘తత్ కరటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్’ అనే మంత్రం ఉంది. ఈ ఒక్కచోటే గజముఖుడి గురించి వేదాల్లో కనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.
రాజాధిరాజా...నీకే తొలిపూజ!
సోమవారం వినాయక చవితి గణనాథుడు ఎక్కడున్నాడు? రంగురంగుల బొమ్మల్లోనా..? వ్రత కథా పుస్తకాలపైనా..? కాదు ఆయన మనలోనే ఉన్నాడు. మన అంతఃచేతనలో ఉన్నాడు. బుద్ధిలో ఉన్నాడు.మనకు కలిగే సిద్ధిలో ఉన్నాడు...మంచి హృదయంతో ఉండడమే సిసలైన ఆరాధన అని ఉద్బోధిస్తున్నాడు...
స్వరూపం ఇచ్చే సందేశం
ఏనుగు తల
జ్ఞ్థానానికి, యోగానికి సంకేతం
చేతిలోఉన్న పరశువు
అజ్ఞానాన్ని ఖండించే లక్షణంవిరిగిన దంతం
త్యాగానికి చిహ్నం
మనిషి శరీరం మాయకు, ప్రకృతికి చిహ్నం
పెద్ద చెవులు
ఎక్కువగా వినటం
చేతిలో ఉన్న పాశం
విఘ్న నివారణకు ప్రతీక
తొండం
ఓంకారం
నాగబంధం
శక్తికి, కుండలినికి సంకేతం
ఎలుక వాహనం
అన్ని జీవులపై సమభావనకు చిహ్నం
రచన : - Dr కప్పగంతు రామకృష్ణ, 9032044115